భూమి సంవాద్ పేరిట ఈ చర్చ

భూమి సంవాద్ పేరిట ఈ చర్చ

హైదరాబాద్, వెలుగు: ‘ధరణి సమస్యలు - దరి చేర్చే మార్గాలు’ అనే అంశంపై తార్నాకలోని లీఫ్స్ సంస్థ ఆఫీసులో చర్చా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు జి.జీవన్ రెడ్డి వెల్లడించారు. భూములపై హక్కుల చిక్కులు తొలగాలంటే మంచి చట్టాలు, సమర్థవంతమైన భూపరిపాలన, సత్వరం సమస్యలను పరిష్కరించే న్యాయ వ్యవస్థ ఉండాలన్నారు.

ఈ ఉద్దేశంతోనే భూమి సంవాద్ పేరిట ఈ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. భూ చట్టాల నిపుణుడు సునీల్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ధరణి సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి, టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి హాజరవుతున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు.