
మాదాపూర్/చందానగర్, వెలుగు: సిటీలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన మోస్తరు వర్షంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది. ఇటీవల రోడ్లు దెబ్బతినడం, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో సమస్య మరింత జటిలమైంది. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినప్పటికీ.. పలు కంపెనీలు పట్టించుకోలేదు. తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించుకోవడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది.
సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ గజారావు భూపాల్, పోలీసు అధికారులు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద వరద నీరు దుర్గం చెరువులో కలిసే పైప్లైన్ను మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీతో కలిసి పరిశీలించారు. రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా వాటర్ లాగింగ్ పాయింట్ను కూడా సందర్శించి, వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా, ట్రాఫిక్ రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీ
సైబరాబాద్లో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గజారావు భూపాల్ ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ, ఉద్యోగుల భద్రత, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఆగస్టు 14న ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని సూచించారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.
వెహికల్స్ బ్రేక్ డౌన్
వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో వెహికల్స్ బ్రేక్డౌన్ అయ్యాయి. మజీద్బండ నుంచి బొటానికల్గార్డెన్వైపు వెళ్లే దారిలో శ్రీరాంనగర్వద్ద వాటర్ట్యాంకర్ఆగిపోయింది. సైబర్టవర్నుంచి బయోడైవర్సిటీ పార్కు వైపు వెళ్లే రూట్లో ఐకియా అండర్పాస్వద్ద ఓ వాహనం బ్రేక్ డౌన్అయ్యింది. నల్లగండ్ల ఫ్లైఓవర్నుంచి నల్లగండ్ల చౌరస్తా వెళ్లే రోడ్డులో ఓ స్కూల్ బస్సు మధ్యలో నిలిచిపోయింది. గచ్చిబౌలి జంక్షన్వెళ్లే రోడ్డులో ఐఐఐటీ జంక్షన్వద్ద లారీ బ్రేక్డౌన్అయ్యింది. ఈ కారణంగా ఆయా రూట్లలో ట్రాఫిక్ జామ్ఏర్పడింది.