సికింద్రాబాద్ మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ సోదాలు

సికింద్రాబాద్  మానేపల్లి జ్యువెలర్స్ లో ఐటీ సోదాలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​మానేపల్లి జ్యువెలర్స్​లో ఐటీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దుకాణంలోని పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. 

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నా యన్న ఫిర్యాదుల మేరకు ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.