ఆ చెల్లికి 40 ఏండ్ల తర్వాత రాఖీ పండుగ.. అన్న అడవుల్లో నుంచి రావడంతో చెల్లెలు సంబురం !

ఆ చెల్లికి 40 ఏండ్ల తర్వాత రాఖీ పండుగ.. అన్న అడవుల్లో నుంచి రావడంతో చెల్లెలు సంబురం !

కోరుట్ల, వెలుగు: సాయుధ పోరులో అడవి బాట పట్టి మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిన చెల్లి నాలుగు దశాబ్దాల తర్వాత   అన్నకు రాఖీ కట్టింది.  జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్ కు చెందిన​పసుల శాంతక్క 40 ఏండ్ల కింద వెళ్లి దండకారణ్యంలో మావోయిస్టుగా చేసింది. కేంద్ర కమిటీ సభ్యురాలిగా, నార్త్​బస్తర్ ​డివిజన్ ​ఇన్​చార్జ్ గా ఆమె వ్యవహరిస్తూ..  అనారోగ్యం కారణంగా నాలుగు నెలల కింద  ఛత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 

అనంతరం కోరుట్ల టౌన్ లో అత్తగారింటికి వచ్చి ఉంటుంది. రాఖీ పండుగ సందర్భంగా శనివారం శాంతక్క పుట్టిల్లు కథలాపూర్​మండలం సిరికొండ గ్రామానికి వెళ్లింది.  అన్న బత్తుల రాజంకు రాఖీ కట్టింది. 40 ఏండ్ల తర్వాత అన్నకు రాఖీ కట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె భావోద్వేగానికి గురైంది.