హైదరాబాద్,వెలుగు: పాలిటిక్స్లోకి వారసుడి ఎంట్రీపై మజ్లిస్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. బహదూర్పురా అభ్యర్థిగా పార్టీ శాస్ర్తిపురం కార్పొరేటర్ మహ్మద్ మోబిన్ను అధినేత అసదుద్దీన్ఓవైసీ గురువారం ఖరారు చేశారు. కాగా.. వారసుడిని రాజకీయాల్లోకి తీసుకు రావాలనే ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్పెట్టారు. ముందుగా మజ్లిస్ మరో నేత అక్బరుద్దీన్ ఓవైసీ కొడుకు నూరుద్దీన్ఓవైసీని చార్మినార్ లేదంటే బహదూర్పురా నుంచి అభ్యర్థిగా ప్రకటించాలని భావించారు.
దీంతో పార్టీ సీనియర్ఎమ్మెల్యే ముంతాజ్ఖాన్కు టికెట్ నిరాకరించారు. అయితే.. వారసుడి ఎంట్రీపై ఓవైసీ బ్రదర్స్ మధ్య కొంత బేధాభిప్రాయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో బహదూర్పురా, చార్మినార్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది. ఇప్పట్లో వారసుడిని పోటీకి దింపకూడదని ఓవైసీ సోదరులు నిర్ణయించుకోవడంతో చివరకు బహదూర్పురా టికెట్ను కార్పొరేటర్మహమ్మద్ మోబిన్కు కేటాయించారు. 2002లో ఆగాపురా డివిజన్ నుంచి, 2009,2015 ఎన్నికల్లో రామ్నాస్పురా నుంచి కార్పొరేటర్గా మహ్మద్ మోబిన్ గెలుపొందారు. 2020 జరిగిన బల్దియా ఎన్నికల్లో శాస్ర్తిపురం డివిజన్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్గా విజయం సాధించారు.
చార్మినార్పై మజ్లిస్లో వీడని ఉత్కంఠ.. కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
చార్మినార్ సెగ్మెంట్కు అభ్యర్థిని పేరును మజ్లిస్ ఇంకా ప్రకటించలేదు. ఈ సెగ్మెంట్ను పెండింగ్లో పెట్టడంతో తనకు టికెట్ దక్కదేమోనని సిట్టింగ్ ఎమ్మెల్యే, మజ్లిస్ సీనియర్ నేత ముంతాజ్ఖాన్కు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాకుంటే ఇండిపెండెంట్పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఓల్డ్ సిటీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ దృష్టి పెట్టింది. మజ్లిస్లోని వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా కొన్ని రోజులుగాముంతాజ్ఖాన్తో మంతనాలు చేసింది. ఆయన కాంగ్రెస్లో చేరితే చార్మినార్ అభ్యర్థిగా ప్రకటిస్తామని ఆఫర్ఇచ్చింది. ముంతాజ్ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, చర్చలు జరుగుతుండగానే కాంగ్రెస్ గురువారం రిలీజ్ చేసిన ఫైనల్ లిస్ట్లో చార్మినార్ అభ్యర్థిగా మహ్మద్ ముజీబ్ పేరును ప్రకటించింది.