మైత్రీ మూవీ మేకర్స్ పై కొనసాగుతోన్న ఐటీ సోదాలు

మైత్రీ మూవీ మేకర్స్ పై కొనసాగుతోన్న ఐటీ సోదాలు

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో  ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి15 చోట్ల  సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప, శ్రీమంతుడు, సర్కార్ వారి పాట ,రంగస్థలం, జనతా గ్యారేజ్ మూవీతో పాటు పలు సినిమాలు నిర్మించారు. గతేడాది పుష్ప అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ను  ప్రారంభించారు.