కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!
కుమారుడితో కలిసి హస్తం పార్టీలో జాయిన్ అవుతారని ప్రచారం
నాగర్ కర్నూల్ టికెట్ కోసం కూచుకుళ్ల ప్రయత్నం

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఐదు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసిన కూచకుళ్ల సమీప ప్రత్యర్థి నాగం జనార్దన్ రెడ్ది చేతిలో నాలుగుసార్లు ఓడిపోయారు. ఐదో సారి ఈ స్థానం నుంచి మర్రి జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందారు. 2021లో బీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాగర్ కర్నూల్ ప్రాంతంలో అనుచరగణం కలిగి ఉన్న కూచకుళ్ల సొంతగూటికి చేరుతారని ఇటీవల ప్రచారం జరిగింది. త్వరలో తన కుమారుడు రాజేశ్ రెడ్డితో కలిసి హస్తం పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్న ఆయన కాసేపట్లో మల్లు రవితో భేటీ అవుతారని సమాచారం.