కరోనా వ్యాక్సిన్ రెడీ చేశాం…గుడ్ న్యూస్ చెప్పిన ఇటలీ

కరోనా వ్యాక్సిన్ రెడీ చేశాం…గుడ్ న్యూస్ చెప్పిన ఇటలీ
  • ఎలుకలపై ప్రయోగం సక్సెస్ అయినట్లు ప్రకటన

రోమ్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు అన్ని దేశాలు సీరియస్ గా వ్యాక్సిన్ తయారీకి కష్టపడుతున్నాయి. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటలీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నివారణకు తమ సైంటిస్టులు వ్యాక్సిన్ రెడీ చేసినట్లు ఇటలీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది. టకీస్ సంస్థ దీన్ని సిద్ధం చేసి మానవ కణాలపై పనిచేసే ఎలుకల్లో దీన్ని ప్రయోగించారు. ఈ వ్యాక్సిన్ యాంటీ బాడీలను ఉత్తత్తి చేసిందని …వ్యాక్సిన్ తయారీలో ఇదో కొత్త ఫేజ్ అని తెలిపారు. మానవ కణాలలో వైరస్ ను వ్యాక్సిన్ న్యూట్రల్ చేసిందని టకీస్ సీఈఓ లుయిగి కఆరిసిచియో తెలిపారు. సల్లాంజనీ హాస్పిటల్ లో దీన్ని ప్రయోగించారు. తర్వలోనే క్లినికల్ ట్రయల్స్ చేస్తామన్నారు. కచ్చితంగా కరోనాను నివారిస్తుందని…తమ ప్రయోగం రిజల్ట్స్ అంచనాలకు మించి వచ్చాయని అన్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్ త్వరలోనే రావచ్చని ఆశలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వంద సంస్థలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి.