బద్రినాథ్ టెంపుల్ ముందు జవాన్ల శివరాత్రి వేడుకలు

బద్రినాథ్ టెంపుల్ ముందు జవాన్ల శివరాత్రి వేడుకలు

దేశ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన శైవక్షేత్రాలు భక్తులతో మార్మోగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది మహాశివరాత్రి సందర్భంగా చుట్టూ దట్టమైన మంచు  కురుస్తుండగా అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రీనాథ్ ఆలయం ముందు  'భారత్ మాతా కీ జై' అని నినాదాలు చేశారు. జాతీయ జెండాతో వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.