యాదాద్రి జిల్లాలో బైక్ ను కారు ఢీకొని లెక్చరర్ మృతి

యాదాద్రి జిల్లాలో బైక్ ను కారు ఢీకొని లెక్చరర్ మృతి

ఆలేరు(యాదాద్రి), వెలుగు : బైక్​ను కారు ఢీకొని లెక్చరర్​ మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా ఆలేరులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన సుంకరనేని శ్రీనాథ్​ (36)ఆలేరులోని ఐటీఐ లెక్చరర్​గా పని చేస్తూ స్థానికంగా సిల్క్​ నగర్​లో నివాసం ఉంటున్నాడు. బైక్​పై బయటకు వెళ్లిన శ్రీనాథ్​ బుధవారం రాత్రి పది గంటల తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నాడు. 

రఘునాథపురం ఆరోవోబీ నుంచి కిందకు వెళ్తున్న సమయంలో కర్ణాటకకు చెందిన కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనాథ్​ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చూసిన స్థానికులు కారును వెంబడించి పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డ్రైవర్​ సిద్ధారంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.