శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

మొహాలి టెస్టులో శ్రీలంకపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇన్నింగ్స్ 222  పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక సెంకడ్ ఇన్నింగ్స్ లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 4 వికెట్లు,రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, షమీ 2వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో శ్రీలంక 174 రన్స్ కు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియా లంకను ఫాలో ఆన్ ఆడించింది. 400 పరుగుల భారీ లక్ష్యంతో ఫాలో ఆన్ ఆరంభించిన శ్రీలంక బ్యాటర్స్ రెండో  ఇన్నింగ్స్ లోనూ తడబడ్డారు. ఫస్ట్ టెస్టును కేవలం మూడు రోజుల్లోనే ముగించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన జడేజా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు.  బ్యాటింగ్  లోనూ 175 రన్స్ చేసిన జడేజా నాటౌట్ గా నిలిచాడు.  ఈ నెల 12 న భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్ట్ బెంగళూరు లో జరగనుంది.

మరిన్ని వార్తల కోసం

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం

కపిల్ దేవ్ రికార్డ్ ని బ్రేక్ చేసిన అశ్విన్