లంచం తీసుకుంటూ దొరికిన జగద్గిరిగుట్ట ఎస్ఐ

 లంచం తీసుకుంటూ దొరికిన జగద్గిరిగుట్ట ఎస్ఐ

జీడిమెట్ల:   హైదరాబాద్ లో డీజే వెహికల్ సిస్టమ్​ను వదిలిపెట్టేందుకు లంచం తీసుకుంటూ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇటీవల జగద్గిరిగుట్టకు చెందిన  ఓ వ్యక్తి  వెహికల్ పై డీజే  సిస్టమ్​తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్​చేశారు. కాగా, వదిలిపెట్టేందుకు జగద్గిరిగుట్ట ఎస్ఐ శంకర్​ రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.

శనివారం మధ్యాహ్నం మధ్యవర్తి నాగేందర్​ నుంచి ఎస్ఐ శంకర్ రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రైడ్ చేసి రెడ్​హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ ఐని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్టు  ఏసీబీ ఆఫీసర్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 9440446106 కు వాట్సాప్​ ద్వారా ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఆఫీసర్లు సూచించారు.