
జీడిమెట్ల, వెలుగు: ఓ ఇంట్లో గ్యాస్ లీకేజీ జరిగి మంటలు చెలరేగాయి. జగద్గిరిగుట్ట ఉషోదయకాలనీ వినాయకనగర్ రెసెడిన్సీలో సునీత, ప్రశాంత్దంపతులు నివాసముంటారు. బుధవారం సాయంత్రం సునీత ఇంట్లో వంటచేస్తుండగా బయట ఉంచిన సిలిండర్ పైప్ ఊడిపోయి గ్యాస్ లీకేజీ అయింది. దీంతో మంటలు అంటుకున్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసి గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేశారు. సిలిండర్ రూం బయట ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కొన్ని వస్తువులు కాలిపోయాయి.