జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించండి

జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఆలోచించండి

పౌరసత్వ సవరణ చట్టానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన మద్దతు గురించి మరోసారి ఆలోచించాలని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ‘నేను నా మిత్రుడు జగన్ మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నాను. CAAపై కేంద్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన మద్ధతు గురించి పునరాలోచించండి. మనం ఈ దేశాన్ని కాపాడాలి’ అని CAAకి వ్యతిరేకంగా దారుస్సలాం వద్ద జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఒవైసీ అన్నారు.

ర్యాలీలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘పౌరసత్వ సవరణ చట్టం మరియు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్‌షిప్‌లకు వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ తమ ఇళ్ల ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. అలా చేస్తే కేంద్ర ప్రభుత్వం తప్పుచేసిందనే సందేశం వారికి పంపినట్లు అవుతుంది’ అని ఓవైసీ అన్నారు.

కొత్తగా అమల్లోకి వచ్చిన పౌరసత్వ చట్టం మరియు ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా శనివారం ఓవైసీ దారుస్సలాంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.