విశాఖకు రూ.394.50 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ సర్కార్

విశాఖకు రూ.394.50 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ సర్కార్

విశాఖకు పలు అభివృద్ధి పనులకు అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఏడు జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసింది జగన్ సర్కార్. కాపులుప్పాడ సమీపంలోని బయో మైనింగ్‌ ప్లాంట్‌ కు  రూ. 22.5 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియంకు రూ. 37 కోట్లు, సిరిపురం జంక్షన్‌లో మల్టీ లెవల్ కార్‌ పార్కింగ్‌, వాణిజ్య సముదాయ నిర్మాణానికి రూ. 80 కోట్లు మంజూరయ్యాయి. అలాగే నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం రీసెర్చ్‌ సంస్థ కు  రూ. 88 కోట్లు, చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణానికి రూ. 90 కోట్లు, మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌, బీచ్‌ రోడ్డు భూగర్భ పార్కింగ్‌ కు రూ. 40 కోట్లు,  విశాఖ ఐటీ సెజ్‌ నుంచి బీచ్‌ రోడ్డు నిర్మాణానికి  రూ. 75 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.