దారి మధ్యలో కారు దిగిన జగన్​... ఓ చిన్నారికి వైద్య సాయం

దారి మధ్యలో కారు దిగిన జగన్​... ఓ చిన్నారికి వైద్య సాయం

జగన్​ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు.  భోగాపురం ఎయిర్​ పోర్ట్​ శంకుస్థాపనకు వెళ్తున్న జగన్​ కారు మధ్యలోనే ఆపేశారు.  ఒక చిన్నారి తల్లి దండ్రుల ఆవేదననకు గమనించిన ఆయన.. వెంటనే వారిని హెలిప్యాడ్ వద్దకు తీసుకు రావాలని తన సిబ్బందిని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వారి వినతిని విన్న జగన్ వెంటనే పాపకు మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చూడాలని ఆదేశించారు . నిధులతో సంబంధం లేకుండా వారు తిరిగి ఆరోగ్యవంతులయ్యేందుకు అవసరమైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే పింఛన్లు కూడా అక్కడికక్కడే మంజూరు చేయడం జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి జరుగుతున్నది. 

జగన్ జిల్లాల పర్యటనలో ఎందరో చిన్నారులను ఆదుకున్నారు. ఎందరికో ఆయన పర్యటన సందర్భంగా చికిత్సకు నిధులు కేటాయిస్తున్నారు. జగన్ జిల్లాల పర్యటనలో దీర్ఘకాల వ్యాధితో ఇబ్బంది పడే చిన్నారులను తీసుకువచ్చి జగన్కు కన్పించేలా నిలుచుని ఉంటార. వారిని చూసిన జగన్ ఆగివారితో మాట్లాడి వారిబిడ్డల అనారోగ్యం వివరాలను తెలుసుకుని సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశిస్తుంటారు. మెరుగైన వైద్యం వారికి అందేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు.