కాంగ్రెస్ నిర్మించిన డ్యాం నీళ్లు తాగే హరీశ్ పెరిగాడు:జగ్గారెడ్డి

కాంగ్రెస్ నిర్మించిన డ్యాం నీళ్లు తాగే హరీశ్ పెరిగాడు:జగ్గారెడ్డి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదనడం సరైంది కాదన్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవలేదన్న బాధతోనే హరీశ్ అలాంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల గురించి మీ మామను అడిగి తెలుసుకోవాలని, పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోమని జగ్గారెడ్డి హెచ్చరించారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం గా ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్మించిందని.. కేవలం ఒక్క కాళేశ్వరం కట్టిన మీరు.. ఇంత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్ళు ఎందులో నింపుతున్నావు… కాంగ్రెస్ కట్టిన సింగూర్, మంజీరా డ్యామ్ లోనే కాదా అని ప్రశ్నించారు. మీకు ఏమైనా పర్సనల్ ఉంటే మీ ఇంట్లో చూసుకోవలన్న జగ్గారెడ్డి..కాంగ్రెస్ కట్టిన సింగూర్ డ్యామ్ నీళ్లు తాగే హరీశ్ పెరిగాడన్నారు. కాంగ్రెస్‌ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం కారణంగానే మీ కుటుంబానికి ఇన్ని పదవులు వచ్చాయన్నారు.

కేసీఆర్.. సీఎం హోదాలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష నేతలను పిలిస్తే బాగుండేదన్నారు జగ్గారెడ్డి.