నా దగ్గరో మెడిసిన్ ఉంది.. పీసీసీ ఇవ్వండి : జగ్గారెడ్డి

నా దగ్గరో మెడిసిన్ ఉంది.. పీసీసీ ఇవ్వండి : జగ్గారెడ్డి

ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని కోరారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గాంధీభవన్ లో మాట్లాడిన ఆయన.. మున్సిపల్ ఎలక్షన్, హుజుర్ నగర్ లో ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనసాగించాలని కోరారు. ఒక వేళ పీసీసీ మార్చాలనుకుంటే పార్టీలో సమర్థులు చాలా మంది ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీ అయితే ఒక్కరే హీరో ఉంటారు కానీ.. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో చాలామంది హీరోలు ఉంటారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సంపత్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ ఆలీ పోటీలో ఉన్నారని చెప్పారు జగ్గారెడ్డి.

అవకాశం ఉంటే తనకు కూడా పీసీసీ ఇవ్వాలని కుంతియాను కోరినట్టుగా చెప్పారు జగ్గారెడ్డి. తాను ఎవ్వరికీ పోటీ కాదనీ… ఇది తన అభిప్రాయం మాత్రమే అన్నారాయన. “ఆర్గనైజేషన్ ను కాపాడడానికి పని చేస్తా.. అధికారంలోకి వస్తే కనీసం మంత్రి పదవి కూడా అడగను. పార్టీ బలోపేతం కావాలంటే కేసీఆర్ ను బీజేపీని తిట్టాల్సిన అవసరం లేదు. నాకు పీసీసీ ఇవ్వండి… నా దగ్గరో మెడిసిన్ ఉంది. మొత్తం మార్చుతా… పార్టీని అధికారంలోకి తీసుకువస్తా” అని జగ్గారెడ్డి అన్నారు.