మా ఎంపీల్లో పార్టీ మారేటోళ్లెవరు? : జగ్గారెడ్డి 

మా ఎంపీల్లో పార్టీ మారేటోళ్లెవరు? : జగ్గారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఇద్దరు ఎంపీలు పార్టీని వీడతారని మంత్రి కేటీఆర్ చెప్పడం దుర్మార్గమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ కు ముగ్గురు ఎంపీలు ఉన్నారని, అందులో ఒకరు పీసీసీ చీఫ్, మరొకరు పీసీసీ మాజీ చీఫ్ కాగా, ఇంకో ఎంపీ ఎప్పుడో ఒక రోజు పీసీసీ చీఫ్ కావాలని అనుకుంటున్నారని అన్నారు. వీరిలో పార్టీ మారేది ఎవరో కేటీఆర్ కే తెలియాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే కేటీఆర్ కి ఈ హోదాలు వచ్చేవా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పుట్టుకతోనే కింగ్ అని, కేటీఆర్ మిడిల్ ఏజ్ లో కింగ్ అని కామెంట్ చేశారు.