- గంజాయి బయట కొనుడేందని.. ఇంట్లనే పెంచిండు!
- పోలీసులకు చిక్కిన నిందితుడు
మల్యాల, వెలుగు: గంజాయికి బానిసైన ఓ వ్యక్తి బయట కొంటే ఎక్కువ డబ్బులు అవుతున్నాయని ఏకంగా ఇంట్లోనే పెంచే ప్రయత్నం చేసిండు. 11 గంజాయి మొక్కలు పెంచుతూ చివరికి పోలీసులకు చిక్కిండు. మల్యాల ఎస్ఐ చిరంజీవి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓగులాపూర్ కు చెందిన అల్వాల శశిధర్ అదే గ్రామానికి చెందిన మరో బాలుడు గంజాయికి బానిసయ్యారు. ఎప్పుడూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుక్కునేవారు. డబ్బులు లేకపోవడంతో గంజాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శశిధర్ మొదట తన ఇంటి ఆవరణలో 11 గంజాయి మొక్కలు పెంచాడు. సక్సెస్అయితే మరిన్ని పెంచాలని ప్లాన్ వేశాడు. తాము వాడగా మిగిలింది అమ్ముకోవచ్చనుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఎస్ఐ చిరంజీవి బుధవారం రైడ్ చేసి గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ సుజాత సమక్షంలో పంచనామా చేసి కేసు బుక్ చేసినట్టు చెప్పారు.