ప్రజావాణి సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి సమస్యలను వెంటవెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 59 ఫిర్యాదులను స్వీకరించారు. కొడిమ్యాల మండలం కొండాపూర్ శివారులోని బూరుకుంట చెరువు మత్తడిని కొంతమంది ధ్వంసం చేశారంటూ రైతులు పురుగుమందు డబ్బాలతో కలెక్టరేట్ కు వచ్చారు. తమకు జీవనాధారమైన పంట పొలాలు నీట మునుగుతున్నాయని ఆదుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. 

కుల బహిష్కరణ చేశారని తమకు న్యాయం చేయాలని రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కన్న కొడుకులు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. తనకున్న 5 ఎకరాలను వారికి ఇచ్చినా తనను చూసుకోవడం లేదని, కనీసం అన్నం కూడా పెట్టడం లేదని వాపోయాడు. ప్రస్తుతం బయట కూలి పని చేసుకుంటూ చెట్ల కింద పడుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు

సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే

వివిధ రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ ముఖ్య లక్ష్యమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ఆఫీసులో నిర్వహించిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 18 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

307 అప్లికేషన్ల  స్వీకరణ

కరీంనగర్ టౌన్, వెలుగు: గ్రీవెన్స్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణికి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్రజల నుంచి 307 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో స్వీకరించిన అప్లికేషన్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా సత్వరమే  పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అధికారులు
 పాల్గొన్నారు.