జై మహాభారత్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. తమ పార్టీ అధ్యక్షుడు అనంత విష్ణు ప్రభుపై కేసు నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై ఇటీవలి పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారికి నచ్చజెప్పేందుకు సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ప్రయత్నించారు. ఈనేపథ్యంలో పోలీసు స్టేషన్ పరిసరాల్లో పోలీసులను మోహరించారు. కాగా, ‘జై మహాభారత్’ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ 5 లక్షల ఆధార్ కార్డులు సేకరించిన భగవాన్ అనంత విష్ణు ప్రభు అలియాస్ రామ్ దాస్ పై సైఫాబాద్ పీఎస్ లో జులై 7న కేసు నమోదైంది. పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్ట్రాక్షన్ అభియోగాలతో ఐపీసీ 420, 290,341 సెక్షన్ల కింద కేసు పెట్టారు. పార్టీ రిజిస్ట్రేషన్ పై సైఫాబాద్ పోలీసులు ఎన్నికల సంఘాని (ఈసీ)కి లేఖ రాశారు. భారీ ఎత్తున ఆధార్కార్డులు సేకరించారంటూ ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డును సమర్పించి జైమహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి .. 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తానని రామ్దాస్ ప్రజలను నమ్మించినట్లు పేర్కొన్నారు.
అనంత విష్ణు ప్రభుపై కేసులు ఉపసంహరించుకోవాలి
- తెలంగాణం
- July 9, 2022
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో