- నాన్బెయిలబుల్ కేసులు బుక్ చేస్తున్న పోలీసులు
- మంచిర్యాలలో మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్న బీజేవైఎం లీడర్లపై కేసులు
- సంతాకాలు తీసుకొని పంపుతామని కోర్టుకు.. బెయిలిచ్చిన కోర్టు
- పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ముందు ధర్నా
మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల కాన్వాయ్లను అడ్డుకుంటే జైలుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇప్పటివరకు ఆందోళనకారులను అరెస్ట్ చేసి బెయిలబుల్సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేస్తున్నారు. మూడు రోజుల కింద మంచిర్యాలలో ఆర్అండ్బీ మినిస్టర్ వేముల ప్రశాంత్రెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్నందుకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సహా 11 మంది లీడర్లపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు ఫైల్చేశారు. సంతకాల కోసం స్టేషన్కు రావాలని పిలిచి వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. అయితే వారికి మేజిస్ర్టేట్ బెయిల్ శాంక్షన్ చేశారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలన్నందుకు...
ఆర్అండ్బీ మినిస్టర్ వేముల ప్రశాంత్రెడ్డి ఈ నెల 1న మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఐబీ చౌరస్తాలో నినాదాలు చేస్తూ మంత్రి కాన్వాయ్కు అడ్డుగా వెళ్లారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
ఐదు నిమిషాల్లోనే పంపుతామని అరెస్ట్
మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారంటూ పోలీసులు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ రాచకొండ సత్యనారాయణ, శానగొండ రాజేందర్, ఎం.సుమన్యాదవ్, కుర్రె చక్రవర్తి, పల్లి రాకేశ్, కొత్త శివమణి, ఠాకూర్ తరుణ్, సింగరవేని శివకుమార్, అరెందుల రాజేశ్, అమిరిశెట్టి రాజ్కుమార్లపై ఐపీసీ 143, 149, 341 సెక్షన్లతో పాటు 353 నాన్బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు. ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచారు. గురువారం ఉదయం ఎస్సై కిరణ్, సీఐ నారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావుకు ఫోన్ చేసి మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న ఘటనలో బీజేవైఎం లీడర్లపై కేసు ఫైల్ చేశామని, ఐదు నిమిషాల్లో స్టేషన్ కు వస్తే బెయిల్ ఇచ్చి పంపిస్తామని, మిగతావాళ్లను తీసుకొని రావాలని కోరారు. దీంతో రఘునాథ్రావు మధ్యాహ్నం 2గంటలకు అందుబాటులో ఉన్న పట్టి వెంకటకృష్ణ, రాచకొండ సత్యనారాయణ, కుర్రె చక్రవర్తి, పల్లి రాకేశ్, కొత్త శివమణి, అమిరిశెట్టి రాజ్కుమార్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బీజేపీ లీడర్లు బయట మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా అందరినీ బలవంతంగా వెహికిల్స్లో ఎక్కించుకొని సరాసరి కోర్టుకు తీసుకెళ్లారు. స్పెషల్జ్యుడీషియల్ఫస్ట్ క్లాస్ మేజిస్ర్టేట్(ఎక్సైజ్ కోర్టు) ఎదుట వీరిని హాజరుపర్చారు. శానగొండ రాజేందర్, ఎం.సుమన్ యాదవ్, అరెందుల రాజేశ్, సింగరవేణి శివకుమార్, ఠాకూర్ తరుణ్ పరారీలో ఉన్నారని చెప్పారు. కేసును పరిశీలించిన మేజిస్ర్టేట్ నిందితులకు బెయిల్ శాంక్షన్ చేశారు.
అరెస్టులకు భయపడేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్రావు
ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అణిచివేయాలని చూస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావు మండిపడ్డారు. తాము కేసులకు, అరెస్టులకు భయపడబోమన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్రావు మాట్లాడుతూ పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. యువమోర్చా లీడర్ల సంతకాలు తీసుకొని ఐదు నిమిషాల్లో పంపుతామని అబద్ధాలు చెప్పి, అక్రమంగా అరెస్టు చేశారని ఫైర్ అయ్యారు. ఏసీపీ రష్మీ పెరుమాల్, పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డిలకు ఫోన్ చేయగా చట్టప్రకారమే యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పడం బాధాకరమన్నారు. ఫ్రెండీ పోలీసింగ్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ లీడర్లు పెద్దపల్లి పురుషోత్తం, తుల మధుసూదన్రావు, వంగపల్లి వెంకటేశ్వర్రావు, కొయ్యల ఏమాజీ, అగల్ డ్యూటీ రాజు, పత్తి శ్రీనివాస్, బోయిని హరికృష్ణ, సోమ ప్రదీప్చంద్ర పాల్గొన్నారు.