సీఎం కండ్లు తెర్వాలె: జాజుల

సీఎం కండ్లు తెర్వాలె: జాజుల

హైదరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్​రెడ్డి చనిపోయాడు. ఇది చూసైనా సీఎం కేసీఆర్ కండ్లు తెర్వాలె’ అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​ఆదివారం ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. తల్లిలాంటి సంస్థను కాపాడుకోవడం కోసం కార్మికులకు ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శ్రీనివాస్​రెడ్డి బలిదానమే చివరిది కావాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టే ఆందోళనలో బీసీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.