చిత్తూరులో జోరుగా జల్లికట్టు..ఎంట్రీ ఫీజు రూ.1500

చిత్తూరులో జోరుగా జల్లికట్టు..ఎంట్రీ ఫీజు రూ.1500

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో జల్లికట్టు జోరుగా సాగుతోంది. కనుమనపల్లిలో ఏర్పాటు చేసిన జల్లి కట్టులో పాల్గొనేందుకు 15 వందల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పశువులను పోటీలకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా పలువురికి గాయాయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో జల్లికట్టు నిర్వహిస్తున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు.