- రిజల్ట్ రీకౌంటింగ్లో టీఆర్ఎస్కు ఓటమి.. స్వతంత్రుడి గెలుపు
- కోరికోరి రెండోసారి రీకౌంటింగ్ పెట్టించుకుని ఒక్క ఓటుతో ఓటమి
కౌంటింగ్లో ఆమె గెలిచారు. ఇంకో అభ్యర్థి కోరిక మేరకు చేసిన రీకౌంటింగ్లో ఓట్లు సమానంగా వచ్చినా బ్యాలెట్ ఓటుతో గట్టెక్కారు. అరె మెజారిటీ తక్కువొచ్చిందని మళ్లీ ఆమె కోరికోరి రీకౌంటింగ్ పెట్టించుకున్నారు. చివరకు ఒక్క ఓటుతో గెలిచిన ఆమే.. అదే ఒక్క ఓటుతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థి అనూహ్యంగా గెలిచారు. ఈ చేదు అనుభవం జనగామ జిల్లా దేవరుప్పల మండలం మాధపురం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థికి ఎదురైంది. కౌంటింగ్లో ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థి లకావత్ సుగుణకు 701 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి బానోత్ యాకుబ్కు 693 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ధరావత్ సక్రుకు 269 ఓట్లు పోలయ్యాయి. అయితే, ధరావత్సక్రు రీకౌంటింగ్ చేయాల్సిందిగా కోరారు.
రీకౌంటింగ్లో లకావత్ సుగుణకు పడిన 8 ఓట్లు చెల్లవని తేలింది. ఓట్లు 693కు పడిపోయి యాకుబ్కు సమానం గా నిలిచారు. అయినా బ్యాలెట్ ఓటుతో సుగుణ గెలిచారు. తక్కువ మెజారిటీ వచ్చిందని, మళ్లీ ఇంకోసారి ఓట్లు లెక్కబెట్టా లని సుగుణ కోరారు. అలా కోరికోరి అడిగి ఆమె నష్టా న్ని కొని తెచ్చుకున్నా రు. రీకౌంటింగ్లో మరో రెండు ఓట్లు చెల్లవని తేలింది. దీంతో ఆమెకు వచ్చిన ఓట్లు 692కు తగ్గాయి. చివరకు ఒక్క ఓటుతో స్వతంత్ర అభ్యర్థి యాకుబ్ గెలిచారు. తమ ఏజెంట్లు లేని సమయంలో కౌంటింగ్ చేశారని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా మని, ఓట్లను మళ్లీ లెక్కిం చాలని సుగుణ డిమాండ్ చేశారు.