బాలికపై రేప్ కేసులో 20 ఏండ్ల జైలు

బాలికపై రేప్ కేసులో 20 ఏండ్ల జైలు
  •     రూ.80 వేల జరిమానా కూడా
  •     జనగామ జిల్లా కోర్టు తీర్పు

జనగామ అర్బన్, వెలుగు :  బాలికపై అత్యాచారం కేసులో జనగామ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.  జనగామ సీఐ శ్రీనివాస్​ యాదవ్​ తెలిపిన వివరాల ప్రకారం జనగామ మండలం చీటకోడూర్  గ్రామానికి చెందిన బొట్ల ప్రసాద్​ (35) జనగామ–సూర్యాపేట రోడ్డులో 2019లో ఆయుర్వేదిక్  హాస్పిటల్​ ఏర్పాటు చేశాడు. జనగామకు చెందిన బాలికకు కడుపులో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 

ఆమెకు నయంచేసి పెళ్లి చేసుకుంటానని, తన దగ్గర రిసెప్షనిస్టుగా పెట్టుకుంటానని ప్రసాద్  మాయమాటలు చెప్పాడు. బాలికను శారీకంగా వాడుకొని గర్భిణిని చేసి వదిలేశాడు. అప్పటికే ప్రసాద్​కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మోసపోయిన బాలిక.. జనగామ పోలీస్​ స్టేషన్​లో 2019లో ఫిర్యాదు చేసింది. శుక్రవారం కేసు విచారణకు రాగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి డి.రవీంద్ర శర్మ.. నిందితుడికి పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.80 వేల జరిమానా కూడా విధించారు.