జనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్​ .. బీఆర్​ఎస్​ నేతల మధ్య వాగ్వాదం

జనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్​ .. బీఆర్​ఎస్​ నేతల మధ్య వాగ్వాదం

ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్​ నెం: 263)ని పోలింగ్​ బూత్​నకు యువజన కాంగ్రెస్​ నేత కొమ్మూరి ప్రశాంత్​ రెడ్డి పోలింగ్​సరళిని పరిశీలించడానికి వెళ్లారు.  దీంతో ఆ బూత్​ లో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పోలింగ్​ ఏజంట్​ ప్రవీణ్​..... ప్రశాంత్​ రెడ్డిని అడ్డుకున్నారు.  దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పల్లా  రాజేశ్శర్​ రెడ్డి అక్కడకు చేరుకోవడంతో బీఆర్​ఎస్​ నేతలు రెచ్చిపోయారు.  పరిస్థితి చేయిదాటిపోవడంతో  ఏసీపీ అంకిత్​ ఆదేశాలతో సంఘటన స్థలానికి చేరుకున్న అదనపు పోలీసు బలగాలు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.