జనప్రియ గ్రూప్ 40 ఏళ్ల పూర్తి..త్వరలో కొత్త ప్రాజెక్ట్స్

జనప్రియ గ్రూప్ 40 ఏళ్ల పూర్తి..త్వరలో కొత్త ప్రాజెక్ట్స్

హైదరాబాద్​, వెలుగు: రియ‌‌‌‌‌‌‌‌ల్​ ఎస్టేట్ సంస్థ జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ప్రియ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు చేపడతామని సంస్థ ఫౌండర్​ రవీందర్​ రెడ్డి తెలిపారు. తమ సంస్థ​ 40 ఏళ్లు పూర్తి చేసుకుందని, 40 వేల ఫ్లాట్లను నిర్మించిందని చెప్పారు. 

ఈ సందర్భంగా  హైద‌‌‌‌‌‌‌‌రాబాద్​లో నిర్వహించిన​ సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా  మాట్లాడుతూ ఎన్నో సవాళ్లను తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.  అందరికీ  అందుబాటులో ఉండే ఇళ్లు కట్టించి ఇవ్వడమే తమ ఉద్దేశమని తెలిపారు. 

జనప్రియ కొత్త ప్రాజెక్టులు శిఖర (అదిబట్ల), నైల్​ వ్యాలీ (మియాపూర్) ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తవుతాయి. యూనిటీ (ఇస్నాపూర్​), ఆర్కాడియా (కౌకూర్​) అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల హ్యాండోవర్‌‌ ఇప్పటికే  మొదలయింది.