కేసీఆర్​ఫ్రస్టేషన్​లో ఉన్నడు.. జానారెడ్డి

కేసీఆర్​ఫ్రస్టేషన్​లో ఉన్నడు.. జానారెడ్డి
  • రేవంత్​సర్కార్​కు ఢోకా లేదు
  • ఎంపీ ఎన్నికల్లో -అసెంబ్లీ ఫలితాలే రిపీట్​
  • బీఆర్ఎస్​కు శృంగభంగం తప్పదు

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్​ఏడాది కూడా ఉండే పరిస్థితి లేదని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, కాంగ్రెస్​సీనియర్​నేత జానారెడ్డి కౌంటర్ స్ట్రాంగ్​కౌంటర్​ఇచ్చారు.  బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లోఉన్నారని, రేవంత్​సర్కార్​కు ఎలాంటి ఢోకా లేదన్నారు. అసెంబ్లీ ఫలితాలే ఎంపీ ఎన్నికల్లో రిపీట్​అవుతాయని స్పష్టంచేశారు.

ఇవాళ జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజలే పట్టుకొమ్మలై కాంగ్రెస్ కు అండగా నిలిచారు.  ప్రభుత్వాన్ని కూల్చాలని ట్రై చేసేళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. బీఆర్ఎస్​నేతలకు కాంగ్రెస్​ను విమర్శించే అర్హత లేదు. పదేండ్ల పాలనలో వాళ్లు​ఏమీ చేయలేదు. రాజకీయ లబ్ధికోసమే గులాబీ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోంది. వచ్చే ఎన్నికనల్లో బీఆర్ఎస్​కు శృంగభంగం తప్పదు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజల మద్దతు మాకే ఉంది’ అని జానారెడ్డి అన్నారు.