జనసేన కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐ అంజూయాదవ్ పై తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ . బాధితుడు సాయి మరో ఐదుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి కంప్లైంట్ చేశారు పవన్. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అంతకుముందు పవన్ తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి భారీ ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు.. ఆయన చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు.
వారం రోజుల క్రితం తిరుపతి జిల్లా శ్రీకాళ హస్తిలో నిరసన చేస్తున్న జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వివాదాస్పదమైంది. జనసేన కార్యర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ వైసీపీ లీడర్ లా ప్రవర్తిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఉన్నతాధికారులు అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.