మిమిక్రీతో సెట్ లో అందరిని నవ్వించే వాడు వేణుమాధవ్

మిమిక్రీతో సెట్ లో అందరిని నవ్వించే వాడు వేణుమాధవ్

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మృతి పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు పవన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్ కోలుకుంటారనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన మరణించడం బాధాకరం. గోకులంలో సీత నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. హాస్యం పండిచడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు.  మిమిక్రీ కళాకారుడిగా వేణుమాధవ్‌ ప్రేక్షకులతో పాటు, సెట్ లో కూడా అందరినీ నవ్వించేవారు. వర్తమాన రాజకీయాలపై ఆసక్తి చూపించేవారు. వేణుమాధవ్‌ మృతికి నా తరపున, జనసైనికుల తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని పవన్ తెలిపారు.