కేసీఆర్తో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం తనయుడు భేటీ

కేసీఆర్తో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం తనయుడు భేటీ

ఛత్తీస్ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు, జనతా కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు అమిత్ జోగి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.  పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సుధీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి, దేశంలోని రాజకీయ పరిణామాలు, జాతీయ వ్యవహారాల పై  చర్చించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించడాన్ని అమిత్ జోగి ఆహ్వానించారు.

సంక్షేమం అభివృద్ధి రంగాల్లో దేశంలో ముందు వరుసలో తెలంగాణను నిలిపేందుకు  కృషి చేశారని కేసీఆర్ ను అమిత్ జోగి  అభినందించారు.  ఈ సందర్భంగా తన తండ్రి  అజిత్ జోగి  రాసుకున్న ఆటోబయోగ్రఫీని కేసీఆర్ కు అందజేశారు.