వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో నడవాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో నడవాలి  : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : నవభారత నిర్మాణానికి కృషి చేసిన సర్దార్​ వల్లభాయ్​ పటేల్​ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ చెప్పారు. వల్లభాయ్​ పటేల్​ 150 వ జయంతిని శనివారం జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్​ ఆవరణలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్​ వరంగల్​ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్​ హాజరై వల్లభాయ్​పటేల్, భరతమాత ఫొటోలకు నివాళులు అర్పించారు.

అనంతరం ఐక్యత పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వరంగల్​ డిప్యూటీ డైరెక్టర్​చింతల అన్వేశ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో గోపిరామ్ పాల్గొన్నారు.