జనగామ, వెలుగు : డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా 'ఎన్ఆర్ఎక్స్' డ్రగ్స్ సేల్స్ చేసిన ఏడు మెడికల్ షాపుల లైసెన్స్లను సస్పెండ్ చేశారు. ఒక్కో మెడికల్ షాపు లైసెన్స్ను రెండు రోజుల నుంచి వారం రోజుల వరకూ సస్పెండ్ చేశారు. ఇటీవల జనగామ జిల్లాలోని 65 మెడికల్ షాపుల్లో వినియోగదారుల మాదిరిగా వచ్చిన పీజీ స్టూడెంట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే టాబ్లెట్స్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు.
వీటిల్లో ఏడు మెడికల్ షాపుల నిర్వాహకులు 'ట్రామాడాల్' డ్రగ్తో కూడిన మత్తు కలిగించే టాబ్లెట్స్ విక్రయించారు. దీంతో ఆయా మెడికల్ షాపులకు 'డ్రగ్ అండ్ కాస్మోటిక్స్ చట్టం - 1940 అండ్ రూల్స్ - 1945 ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు షాపుల లైసెన్స్ను సస్పెండ్ చేస్తున్నట్టు బుధవారం తెలిపారు. జనగామ, రఘునాథపల్లి, లింగాల ఘన్పూర్లోని ఆయా షాపులను మూసి వేయించి సీజ్ చేశారు.
