దుబాయ్: ఐపీఎల్–13లో భాగంగా గురువారం దుబాయ్ వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. బెన్ స్టోక్స్(30 ), సంజూ శాంసన్(36 ) రాణించడంతో రాజస్థాన్ ఆమాత్రం స్కోరైనా చేసింది. ఆఖర్లో రియాన్ పరాగ్(20 ) ఫర్వాలేదనిపించాడు. సన్ రైజర్స్ బౌలర్ జేసన్ హోల్డర్(3/33) రాణించడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది రాజస్థాన్. విజయ్ శంకర్, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
Innings Break!@rajasthanroyals post a total of 154/6 on the board.
Will #SRH chase this down?
Live – https://t.co/DogIhHaFa8 #Dream11IPL pic.twitter.com/LILnTrg8vy
— IndianPremierLeague (@IPL) October 22, 2020