
మెల్బోర్న్: న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే.. రెండోసారి ఐసీసీ చైర్మన్గా ఎన్నికయ్యాడు. శనివారం జరిగిన సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకున్నారు. బార్క్లే రెండేళ్ల పాటు ఈ పోస్ట్లో కొనసాగనున్నాడు. చైర్మన్ పదవి రేస్లో ఉన్న జింబాబ్వే క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తవెంగ్వా ముకులానీ నామినేషన్ను విత్డ్రా చేసుకోవడంతో బార్క్లే ఎన్నిక ఏకగ్రీవమైంది. గతంలో న్యూజిలాండ్ క్రికెట్ అసోసియేషన్ (ఎన్జెడ్సీ) హెడ్గా పని చేసిన బార్క్లే.. 2020 నవంబర్లో ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
కమర్షియల్ లాయర్గా అక్లాండ్లో బాగా పేరు సంపాదించిన బార్క్లే.. 2015 వరల్డ్కప్కు డైరెక్టర్గా కూడా పని చేశారు. ఇక ఐసీసీలోనే అత్యంత బలమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ ఎఫైర్స్ కమిటీ హెడ్గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఎన్నికయ్యాడు. ఇంటర్నేషనల్ బోర్డులో మేజర్ ఫైనాన్స్ పాలసీలను ఈ కమిటీయే నిర్ణయిస్తుంది. సభ్య దేశాలకు రెవెన్యూ షేరింగ్, గ్లోబల్ స్పాన్సర్షిప్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.