గ్రోత్​పై ఇప్పుడు మరిన్ని ఆశలు..

గ్రోత్​పై ఇప్పుడు మరిన్ని ఆశలు..
  • గ్రోత్​పై ఇప్పుడు మరిన్ని ఆశలు..
  • మిడిల్​ ఈస్ట్​ యుద్ధం ఎఫెక్ట్​ తక్కువే:ఆర్​బీఐ ఎంపీసీ మెంబర్​ జయంత్​ వర్మ

న్యూఢిల్లీ: ఇండియా ఎకనమిక్​ గ్రోత్​పై ​ కొన్ని నెలల కిందటి కంటే  ఇప్పుడు ఆశలు మరింత పెరిగాయని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మెంబర్​ జయంత్ ​ఆర్​ వర్మ  చెప్పారు. హౌస్​హోల్డ్​ స్పెండింగ్​పైనే  ప్రధానంగా గ్రోత్​ ఇప్పుడు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఇన్​ఫ్లేషన్ ​4 నుంచి 5 శాతం వద్ద చాలా క్వార్టర్లు కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయని వెల్లడించారు. 

మన ఎకనమిక్​ గ్రోత్​పై నాలుగు నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు నమ్మకం పెరిగిందని జయంత్​ ఆర్​ వర్మ వివరించారు. కన్జూమర్​ కాన్ఫిడెన్స్​ ఇంప్రూవ్​ కావడంతోపాటు, వివిధ ఇండికేటర్లు కూడా గ్రోత్​ మొమెంటమ్​ను సూచిస్తున్నాయన్నారు. గ్లోబల్​ గ్రోత్​3 శాతంగానే కొనసాగుతుందన్న ఐఎంఎఫ్​ ఇటీవల ఇండియా గ్రోత్​ను మాత్రం కొద్దిగా పెంచిన విషయం తెలిసిందే.

 వరల్డ్​ ఎకానమీలో మందగమనం​ కారణంగా బయట నుంచి డిమాండ్​ పెద్దగా లేదని, ప్రైవేట్​ పెట్టుబడులు కూడా ఇంకా జోరందుకోలేదని వర్మ వెల్లడించారు. 2021–22 లో 9.1 శాతం గ్రోత్​ సాధించిన మన ఎకానమీ 2022–23 లో 7.2 శాతంతో సరిపెట్టుకుంది. మరోవైపు ఆర్​బీఐ ఈ ఏడాది ఎకానమీ 6.5 శాతం గ్రోత్​ రికార్డు చేయనుందని అంచనా వేస్తోంది. ఇన్​ఫ్లేషన్​ ఎప్పుడు దిగొస్తుందనే ప్రశ్నకు బదులుగా, ఆగస్టు నెలలోనే ఇన్​ఫ్లేషన్​ పెరిగిందని, సెప్టెంబర్​లో అది తగ్గిందని, అక్టోబర్​ నెలలో కూడా తగ్గుముఖంలోనే ఉంటుందని జయంత్​ వర్మ్​ చెప్పారు. 

దేశంలో ఇన్​ఫ్లేషన్​ 4 నుంచి 5 శాతం దాకా కొనసాగే ఛాన్స్​  ఉందని పేర్కొన్నారు. జయంత్​ ఆర్​ వర్మ ఐఐఎం అహ్మదాబాద్​లో ప్రొఫెసర్​గానూ ఉన్నారు.  గత రెండేళ్లుగా దేశంలో కమొడిటీ, ఫుడ్​  ప్రైసెస్​లలో  హెచ్చు–తగ్గులు ఎక్కువయ్యాయని ఆయన చెప్పారు. అందుచేత, ఒకటి – రెండు నెలల్లో ఇన్​ఫ్లేషన్ పెరగడం లేదా తగ్గడం వల్ల పెద్దగా సమస్యలేవీ ఉండవని పేర్కొన్నారు. మిడిల్​ ఈస్ట్​లోని యుద్ధం వల్ల వరల్డ్​ ఎకానమీకి పెద్ద ముప్పు ఏమీ వచ్చే అవకాశాలు కనబడటం లేదని వర్మ స్పష్టం చేశారు. గ్లోబల్​ డిమాండ్​ తగ్గడంతో చమురు ధరలు మరీ ఎక్కువగా పెరిగే ఛాన్స్​ ఉండకపోవచ్చని వివరించారు.