అస్సాం కేబినెట్లో కొత్త మంత్రులుగా జయంత మల్లా బారువా, నందితా గర్లోసా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీమంత శరకరదేవ్ కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సీఎం హిమంత బిస్వా శర్మ , ఇతర కేబినెట్మంత్రుల సమక్షంలో వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి వీరి చేత ప్రమాణం చేయించారు. ఇద్దరు కొత్త మంత్రులతో మంత్రివర్గం సంఖ్య 16కి చేరింది. నందితా గర్లోసా కి విద్యుత్ శాఖ, సాంస్కృతిక శాఖ విభాగాలను కేటాయించగా, జయంత మల్లా బారువాకు హెల్త్ , టూరిజం శాఖలను కేటాయించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
In the august presence of Hon Governor Prof @jagdishmukhi I am happy to have attended oath-taking ceremony of Smt @GorlosaNandita & Shri @jayanta_malla as new cabinet ministers.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 9, 2022
My best wishes for their contributions to ensuring all-round development & public welfare in Assam. pic.twitter.com/I3nUjKxgrE