జేఈఈ మెయిన్ -2022: మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు

జేఈఈ మెయిన్ -2022: మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు

హైదరాబాద్: జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీలను మార్పు చేసింది. మొదటి విడత పరీక్షలను ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1 మరియు 4 తేదీల్లో నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. 
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగాల్సి ఉన్న తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష తేదీలను మార్చాలన్న  విద్యార్థుల విజ్ఞప్తి పై సానుకూల నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. కాగా రాష్ట్రంలో మళ్లీ ఇంటర్ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్