జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పైపు లైన్ రోడ్డులో స్ట్రీల్ బ్రిడ్జి నిర్మాణం చేయొద్దంటూ మారుతీ సన్సిటీ గేటెడ్కమ్యూనిటీ వాసులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎలాంటి ట్రాఫిక్ లేని చోట స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అవసరం లేదన్నారు. రోడ్డును వెడల్పు చేయడానికి మాములు బ్రిడ్జి నిర్మిస్తే చాలన్నారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, సుమారు 300 కుటుంబాలు ఇబ్బంది పడతాయన్నారు. తమ ఇండ్ల వద్దకు స్కూల్ బస్సులు, అంబులెన్స్, వాటర్ ట్యాంకర్లు, ఫైర్ ఇంజన్లు రాలేవని, భవిష్యత్తులో ఇబ్బందులు చూడాల్సి వస్తుందని అన్నారు.

