నదిలో పడిన జీప్.. 10 మంది మృతి

నదిలో పడిన జీప్.. 10 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్​లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఖైబర్​పఖ్తున్​ఖ్వాలోని యార్ఖూన్​నదిలో ఓ జీప్ పడి అందులో ప్రయాణిస్తున్న 10 మంది మృతి చెందారు. యార్ఖూన్ వ్యాలీ సమీపంలోని ఓనచ్​ సస్పెన్షన్ బ్రిడ్జిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.  చిత్రాల్​సిటీ నుంచి యార్ఖూన్ వ్యాలీకి డ్రైవర్ సహా11 మందితో ఈ జీప్ బయలుదేరింది. అయితే జీప్​ రూప్​పై కట్టిన సరుకు కారణంగా అది ఓవర్ లోడ్​అయింది. దీంతో బ్యాలెన్స్​ తప్పి బ్రిడ్జి రెయిలింగ్​ను క్రాస్ చేసి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జీప్​లో ప్రయాణిస్తున్న 11 మందిలో 10 మంది మరణించారని.. ఓ వ్యక్తి మాత్రం నదిలో ఈది ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు తెలిపారు.