అల్టిమేట్ టేబుల్ టెన్నిస్‌లో జీత్ చంద్ర సంచలనం

అల్టిమేట్ టేబుల్ టెన్నిస్‌లో జీత్ చంద్ర  సంచలనం

అహ్మదాబాద్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)లో ఇండియా ప్లేయర్ జీత్ చంద్ర సంచలనం సృష్టించాడు. వరల్డ్ నంబర్ 34 ఆటగాడు, వరల్డ్ చాంపియన్‌‌‌‌ష్‌‌‌‌ రజత పతక విజేత రికార్డో వాల్థర్‌‌‌‌ను 2–-1 తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతనితో పాటు తెలంగాణ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ సత్తా చాటడంతో శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో జైపూర్ పేట్రియాట్స్ జట్టు 11-–4 తేడాతో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్‌‌‌‌పై ఘన విజయం సాధించింది. తొలుత పేట్రియాట్స్ ప్లేయర్ కనక్ ఝా 3–-0తో అహ్మదాబాద్‌‌‌‌కు చెందిన దివ్యాంశ్ శ్రీవాస్తవపై గెలిచి జట్టుకు శుభారంభం ఇచ్చాడు.

 ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌‌‌‌లో బ్రిట్ ఈర్‌‌‌‌లాండ్  3–-0తో జార్జియా పికోలిన్‌‌‌‌ను ఓడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచింది. అయితే, మిక్స్‌‌‌‌డ్ డబుల్స్‌‌‌‌లో అహ్మదాబాద్ జట్టు పుంజుకుంది. రికార్డో వాల్థర్–ఐహికా ముఖర్జీ జోడీ 2–-1 జీత్ చంద్ర– బ్రిట్ ఈర్‌‌‌‌లాండ్‌‌‌‌పై విజయం సాధించింది. కానీ, నాలుగో మ్యాచ్‌‌‌‌లో జీత్ చంద్ర.. వాల్థర్‌‌‌‌ను ఓడించి  జైపూర్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. ఆఖరి పోరులో   ఆకుల శ్రీజ 2–-1 ఐహికా ముఖర్జీని పేట్రియాట్స్‌‌‌‌కు ఘన విజయం అందించింది.