వానర సైన్యాన్ని మించిపోయారు

వానర సైన్యాన్ని మించిపోయారు

హైదరాబాద్: కోతులు ప్రత్యక్షంగా పంటలను తింటున్నాయన్నాయి కానీ.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పరోక్షంగా ప్రజలను తింటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వానర సైన్యాన్ని మించిపోయారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని.. నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నారని సీరియస్ అయ్యారు జీవన్‌రెడ్డి.