
- పటిష్ట భద్రతతో సిద్ధమవుతున్న బోయింగ్ – 777
- సెప్టెంబర్నాటికి అందుబాటులోకి
- అధునాతన హంగులతో
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, వీవీఐపీలు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా రూపుదిద్దుకుంటున్న బోయింగ్ – 777 ఎయిర్క్రాఫ్ట్స్ సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు చివరి నాటికి ఒక ఎయిర్క్రాఫ్ట్ వస్తుందని, సెప్టెంబర్లో రెండో విమానం వస్తుందని ఆ విభాగాన్ని డీల్ చేస్తున్న అధికారి ఒకరు చెప్పారు. యూఎస్లో వీటిని రీ మోడల్ చేస్తున్నట్లు చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎయిర్క్రాఫ్ట్ ఎయిర్ ఫోర్స్ వన్తో సరితూగేలా సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని అధికారి చెప్పారు. వీవీఐపీ ట్రావెలింగ్ కోసం రెండు బోయింగ్ 777 – 300ఈఆర్ ఎయిర్క్రాఫ్ట్లను రీమోడిలింగ్ చేసేందుకు డల్లాస్లోని బోయింగ్ ఫెసిలిటీకి ఎయిర్ ఇండియా తరలించింది. 190 మిలియన్ డాలర్ల వ్యయంతో మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు అన్ని సెక్యూరిటీ మెజర్స్తో దాన్ని రీఫర్నిష్ చేయనున్నారు. ఆ రెండు ఫ్లైట్లు మూడు సంవత్సరాల క్రితం వని, చాలా తక్కువ ఉపయోగించారని అధికారులు చెప్పారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీలు ప్రయాణించేందుకు వీటిని ఉపయోగిస్తారని అన్నారు. “ వీవీఐపీలకు ఎప్పటికీ ముప్పు ఉంటుంది. దేశంలోని అగ్రనాయకులను కాపాడుకునేందుకు కచ్చితంగా చర్యలు తీసుకోవాలి” అని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ (సీఏపీఎస్) రీటైర్డ్ ఎయిర్ మార్షల్ కేకే నోహ్వర్ అన్నారు.
విమానంలోని ప్రత్యేకతలు
- సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్సీఎస్), మిసైల్స్ నుంచి కాపాడుకునేందుకు కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్.
- అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్వ్ ఎలక్ట్రానిక్ వార్ఫార్ సూట్స్.
- మీటింగులు నిర్వహించేందుకు ఆఫీస్ స్పేస్, మీటింగ్ రూమ్స్.
- విస్తృత కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసేందుకు ప్రత్యేక సెక్షన్.
- మన దేశం నుంచి యూఎస్ ప్రయాణించే టప్పుడు మధ్యలో ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం ఆగాల్సిన పనిలేదు.
- ఫ్లైట్లోని రక్షణ వ్యవస్థ శత్రు రాడార్లను జామ్ చేయగలదు. వాటి మార్గదర్శక వ్యవస్థలకు ఇబ్బంది కలిగించడం ద్వారా క్షిపణులను మళ్లించగలదు.