ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడు బలి

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడు బలి

హైదరాబాద్‌ : జూదానికి అలవాటైన యువకుడు ఆ చిక్కునుండి బయటికి రాలేక చివరకి ప్రాణాలే వదిలేసుకుండు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ అతడి ప్రాణం తీసింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సోను కుమార్ యాదవ్ (19) అనే యువకుడు  పంజాగుట్టలోని ద్వారకపురి కాలనీలో స్నేహితులతో కలిసి కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని కొంతకాలంగా ఐపీఎల్ బెట్టింగ్‌ లో పాల్గొంటున్న సోను కుమార్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నాడు.

భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో.. తన బాధను ఎవ్వరికి చెప్పుకోవాలే అర్ధంకాలేదేమో.. మంగళవారం ఉదయం ఫ్రెండ్స్  బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లోని గ్రిల్ కు ఉరి బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సోదరుడు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువత, స్టూడెంట్స్ బెట్టింగ్ పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు పంజాగుట్ట పోలీసులు.