- బీజేపీ మాజీ ఎంపీకి జార్ఖండ్ హైకోర్టు కండీషన్స్
రాంచీ: ఓ కేసులో బెయిల్ ఇవ్వడానికి పీఎం కేర్స్కు డొనేషన్ ఇవ్వాలని, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని జార్ఖండ్ హైకోర్టు కండిషన్ పెట్టింది. 2012లో ఓ ఆందోళన సందర్భంగా రైల్వే ట్రాక్ను బ్లాక్ చేశారంటూ బీజేపీ మాజీ ఎంపీ సోమ్ మరాండీ, మరో ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ కోసం వారు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ కేసును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన బెంచ్ ఒక్కొక్కరూ రూ.35 వేల చొప్పున పీఎం కేర్స్లో డిపాజిట్ చేయాలని, ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కండిషన్ పెట్టింది. దానికి వారు అంగీకరించడంతో బెయిల్ మంజూరు చేసింది. కరోనాకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన లాక్ డౌన్ గైడ్ లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. పీఎం కేర్స్లో డబ్బు డిపాజిట్ చేసినట్టు ప్రూఫ్లు, యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఆధారాలు చూపించిన తర్వాత వీరు ఆరుగురినీ విడుదల చేసినట్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాకేశ్ కుమార్ చెప్పారు.