
న్యూఢిల్లీ: గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందామని జిందాల్ (ఇండియా) లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో రూ.3,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. 2030 నాటికి మూడు దశల్లో రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ ప్లాంట్లో స్పెషల్ కోటెడ్ స్టీల్ ప్రొడక్ట్లను తయారు చేస్తారు. కోల్డ్ రోలింగ్ మిల్ (సీఆర్ఎం), కంటిన్యూయస్ గాల్వనైజింగ్ లైన్ (సీజీఎల్), కలర్ కోటింగ్ లైన్ (సీసీఎల్) సౌకర్యాలతో ఏటా 9.6 లక్షల టన్నుల స్టీల్ను తయారు చేస్తామని కంపెనీ చెబుతోంది.
ఈ ప్లాంట్ను 2027 నాటికి ప్రారంభిస్తామని పేర్కొంది. జిందాల్ ఇండియా స్టీల్ టెక్ లిమిటెడ్ ద్వారా 2030 నాటికి ఫ్లాట్ ప్రొడక్ట్ డివిజన్లో సామర్థ్యం 30 లక్షల టన్నులకు పెంచుతామని, ఏటా 2 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్ పైపుల తయారీ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తామని వివరించింది. ఈ ప్లాంట్తో ఇండియా స్టీల్ దిగుమతులు తగ్గుతాయని, ఒడిశాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జిందాల్ స్టీల్ పేర్కొంది.