పాత ఫోన్‌తో కొత్త జియోఫోన్‌!

పాత ఫోన్‌తో కొత్త జియోఫోన్‌!


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఏదైనా పనిచేస్తున్న 4జీ ఫీచర్ ఫోన్‌‌‌‌ లేదా స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ను ఇచ్చి కొత్త జియోఫోన్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌ను రూ. 4,499 కే పొందే అవకాశాన్ని రిలయన్స్ రిటైల్ ఇస్తోంది. జియోమార్ట్ డిజిటల్‌‌‌‌,  రిలయన్స్ డిజిటల్ స్టోర్ల ద్వారా ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ను పొందొచ్చు. ‘ఎక్స్చేంజ్‌‌‌‌ టూ అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌’ ఆఫర్ ద్వారా దేశంలో డిజిటల్ వాడకం పెరుగుతుందని రిలయన్స్ రిటైల్ పేర్కొంది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌  కిందటేడాది  జియోఫోన్స్‌‌‌‌ నెక్స్ట్‌‌‌‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌‌‌‌లో 2జీబీ ర్యామ్‌‌‌‌, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా రీడ్ అలౌడ్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌లేట్ నౌ వంటి ఫీచర్లూ ఉన్నాయి.