మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు 

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు 

ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హజరువుతారని మాజీ ఎంపీ జీతెందర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధికి ఆకర్షితులై బండి సంజయ్ పాదయాత్రలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు  బీజేపీ లో జాయిన్ అవుతున్నారని తెలిపారు. మునుగోడులో బీజేపీ నిర్వహించిన సభకు ప్రజలను రానివ్వకుండా  అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రలోభాలకు తెరలేపారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభకు భారీగా తరలివచ్చారని చెప్పారు. 

మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని..సీఎం కేసీఆర్ కు ప్రజలు త్వరలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. అకారణంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.